Publish Date:Aug 10, 2025
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక భయం పట్టుకుంది. పులివెందుల పులి.. పులివెందులలో తిరుగే లేదు అని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఓటమి ఖాయమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైతే.. ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. ఎందుకంటే..పులివెందుల అంటే వైఎస్ కంటుకోట.. వైఎస్ తదననంతరం జగన్ కంచుకోట అని ఇంత కాలం చెప్పుకుంటూ తిరిగిన వైసీపీ నేతలకు ఇప్పుడు అక్కడే ఎదురు గాలి వీచడం జీర్ణం కావడం లేదు.
ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం, అదీ ఆరునెలలు మాత్రమే ఉండే పదవి కోసం వైసీపీ యంత్రాంగం మొత్తం పులివెందులలో తిష్ట వేసింది. అయినా విజయం పట్ల ధీమా కరవై కంగారెత్తిపోతున్నది. పులివెందుల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగి దశాబ్దాలు దాటిపోయింది. ఇక్కడ జగన్ కు, ఆయన పార్టీకి ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడానికే భయపడే పరిస్థితి ఉండేది. దాదాపుగా ఇక్కడ స్థానిక ఎన్నికలన్నీ ఏకగ్రీవమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇక్కడ తెలుగుదేశం కూటమి అభ్యర్థిని నిలపడమే కాదు, గెలిపించుకుంటామని కూడా ధీమాగా ఉంటే.. ఇంత కాలం ఇక్కడ తమదే రాజ్యమని విర్రవీగిన వైసీపీయులు తమపై దాడులు జరుగుతున్నాయంటూ డ్రామాలు ఆరంభించేశారు.
ఈసీ వద్దకు వెళ్లి రక్షణ కావాలని మొరపెట్టుకుంటున్నారు. రిగ్గింగు చేసుకునే అవకాశం లేకుండా పోలింగ్ స్టేషన్లను మార్చేశారని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇక్కడి జనం మాత్రం ఇన్నాళ్లకు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి ఏర్పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకుల విశ్లేషణల ప్రకారం వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఆయనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో పరాజయం ఎదురైతే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై పడుతుందని జగన్ కూడా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తాను స్వయంగా పులివెందులలో ప్రచారానికి రాకపోయినా.. బెంగళూరు ప్యాలస్ నుంచి నిరంతరం ప్రచార తీరును పరిశీలిస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు. ఎంతగా దిశానిర్దేశం చేసినా పరిస్థితి అనుకూలంగా కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇక భయపెట్టి గెలిచేద్దామనుకుంటే.. పటిష్ట పోలీసు బందోబస్తు ఆ అవకాశం లేకుండా చేస్తున్నది. ఏది ఏమైనా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి వ్యతిరేకంగా వస్తే..పార్టీ నుంచి వలసలు ఊహించని స్థాయిలో మొదలౌతాయన్న భయం పార్టీ అగ్రనాయతక్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pulivendula-zptc-by[oll-fear-in-ycp-39-203922.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.